ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రిని ఆయన కలుసుకున్నారు. అనంతరం ఈ నెల 27న తమ కుటుంబంలో జరగనున్న ఓ శుభకార్యానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన ఆహ్వానించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. తమ కుటుంబంలో జరిగే శుభకార్యం కోసం సీఎంను ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ పై తాను ఇప్పుడేమీ వ్యాఖ్యానించబోనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ దే విజయం: ఉత్తమ్