telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పోలింగ్ ముగిసిన వెంటనే సర్వే ఫలితాలు: లగడపాటి

Lagadapati Telangana Elections Results
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా ఎన్నికలపై  స్పందించారు.  మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానని లగడపాటి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ  ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు మరోసారి అనుభవజ్ఞులకే పట్టం కడతారని లగడపాటి వ్యాఖ్యానించారు.  
ఓటేసేముందు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ప్రజలు చూస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు పరోక్షంగా లగడపాటి సంకేతాలిచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీ ఎన్నికలపై పలు జాతీయ ఛానెళ్లు ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో లగడపాటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Related posts