సూపర్స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ల ఫస్ట్ క్రేజి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్తో, హైటెక్నికల్ వేల్యూస్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రజిని పోస్టర్స్కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు మురుగదాస్ కు లేడీ సూపర్ స్టార్ నయనతార వార్నింగ్ ఇచ్చినట్టుగా వార్తలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే… గతంలో ఈయన దర్శకత్వంలోనే నయన ‘గజినీ’ సినిమా చేసింది. ఆ సినిమాలో తన పాత్రను బాగా తగ్గించారనీ, చెప్పిందొకటీ, తీసింది మరొకటి అంటూ అప్పట్లో మురుగదాస్తో గొడవపడింది. ‘దర్బార్’ సినిమాలో తన పాత్ర తగ్గిస్తే ఊరుకునేది లేదనీ, అవసరమైతే సినిమాను అడ్డుకుంటానని మురగదాస్కి కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఆమె చెప్పింది వినాలే తప్ప మరొక ఆప్షన్ లేదు కనుక మురుగదాస్ కూడా మౌనంగా ఉండిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
previous post