‘మహానటి’తో జాతీయ ఉత్తమనటి అవార్డుని దక్కించుకున్న కీర్తిసురేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ “మిస్ ఇండియా”. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో జగపతిబాబు, నదియా, రాజేంద్ర ప్రసాద్, వీకే నరేష్, భానుశ్రీ మెహ్రా, పూజిత పొన్నాడ, కమల్ కామరాజు తదితరులు నటించారు. తరుణ్ కుమార్, వై.నరేంద్రనాథ్ రచయితలు. కీర్తి సురేష్ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ సినిమా నవంబర్ 4న నెట్ఫ్లిక్స్లో విడుదలవుతోంది. దసరా సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘లచ్చ గుమ్మడి’ అనే పాటను విడుదల చేశారు. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ వర్ధిని, మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాటతో మరోసారి తమన్ ఆకట్టకున్నారు. ఈ సాంగ్ శ్రోతలను బాగా ఆకట్టుకుంటోంది.
previous post