వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తనకు మేనల్లుడి వంటివాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జగన్ తో తన అనుబంధం తెగిపోయేది కాదని స్పష్టం చేశారు. జగన్ పుట్టకముందు నుంచే తాను వైఎస్ తో కలిసున్నానని తెలిపారు. జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని అన్నారు.
యూపీఏలో వైసీపీని కలపాలని తనను అధిష్ఠానం కోరలేదని తెలిపారు. ఒకవేళ ఆ బాధ్యతలను తనకు అప్పగిస్తే, నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని కేవీపీ స్పష్టం చేశారు. జగన్ కు సీట్లు పెరిగితే యూపీఏ కలుపుకోవాలని చూస్తున్న సంగతి తెలియదని అన్నారు. తాను ప్రస్తుతం జగన్ తో ఎందుకు లేనన్న విషయాన్ని చెప్పేందుకు సరైన సమయం ఇది కాదని పేర్కొన్నారు.