ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. సోమవారం ప్రెస్ మీట్లో వైసీపీ నేతలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గానికి మనస్తాపం కలిగించినందుకు గాను ఆయన మన్నింపు కోరారు. వ్యవహారిక గ్రామీణ భాషా ప్రయోగమే తప్ప ఇందులో ఏ ఒక్కరిని కించపరిచే ఉద్దేశంతో చేసింది కాదని ఆయన చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భజనపరులుగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక కులానికి మనస్తాపం కలిగించినందుకు మన్నింపు కోరుతున్నానన్నారు. ఇందులో ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని కుటుంబరావు మీడియా ద్వారా తెలియజేశారు.