telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కర్నూల్ రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన

Road accident 8 dead and 30 injured

కర్నూల్ జిల్లా వెల్దూర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని ఆదుకోవాలని కోరుతూ బాధిత కుటుంబాలు ఆదివారం నాడు కర్నూల్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.శనివారం సాయంత్రం వెల్దూర్తి వద్ద ప్రైవేట్ బస్సు ఢీ కొనడంతో గద్వాల జిల్లాలోని రామాపురం గ్రామానికి చెందిన 14 మంది మరణించిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఘటనలో మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తైంది. మృతదేహాలను గ్రామానికి తరలించకుండా గ్రామస్తులు కర్నూల్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం నుండి స్పష్టం చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts