telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నిరాడంబరంగా కుమారస్వామి కుమారుడి పెళ్లి !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి బెంగళూరు శివారులోని రామనగర సమీపంలోని ఫామ్ హౌస్ లో నిరాడంబరంగా జరిగింది. కాంగ్రెస్ నేత ఎం.కృష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ పెళ్లి జరిగింది. ఈ వివాహాన్ని చాలా గ్రాండ్ గా చేయాలని తొలుత అనుకున్నప్పటికీ, లాక్ డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా కానిచ్చారు. ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది మాత్రమే పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

మరోవైపు బెంగళూరు కరోనా వైరస్ రెడ్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి గ్రాండ్ గా ఏర్పాట్లు జరుతున్నాయంటూ కర్ణాటక నేతలు విమర్శలు గుప్పించారు. లాక్ నిబంధనలను పాటించకపోతే… రెండో ఆలోచన లేకుండా కుమారస్వామిపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్థనారాయణ హెచ్చరించారు. ఎంతో కాలంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన కుమారస్వామి నిబంధనలను పాటించాలని చెప్పారు. ఇతరులెవరూ పెళ్లికి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని చెప్పారు.

Related posts