telugu navyamedia
సినిమా వార్తలు

“మల్లేశం” చిత్రబృందానికి కేటిఆర్ విషెస్

Mallesham

పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేతకు సంబంధించి ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “మల్లేశం”. ఈ సినిమాలో ప్రియదర్శి, అనన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. పూర్తిస్థాయిలో తెలంగాణ మాండలికంలో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటించింది. “మల్లేశం” సినిమా ట్రైలర్‌ను వీక్షించినట్లు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించే తెలంగాణ చేనేత కార్మికుడు, ఆసుయంత్రం సృష్టికర్త జీవితం ఆధారంగా తీసిన ‘మల్లేశం’ ట్రైలర్‌ను చూశా. ఆసు యంత్రాన్ని కనిపెట్టినందుకు చింతకింది మల్లేశంకు 2017లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ‘మల్లేశం’ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అని కేటీఆర్ ట్వీట్ చేసి, చిత్ర ట్రైలర్ ను ట్యాగ్ చేశారు.

Related posts