జీహెచ్ఎంసీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా విపక్షాలకు తగ్గట్టుగానే అస్త్రాలను తయారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే.. ఇవాళ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. రోహింగ్యాలను, పాకిస్తాన్ కొడుకులను తరిమి తరిమి కొడతాం. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుంది.” అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అయితే.. బండి సంజయ్ సర్జికల్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొన్ని కోట్లు, సీట్ల కోసం మతిస్థితిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా ? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇలా ఓట్ల కోసం మతాలను రెచ్చగొట్టడం దారుణమని ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా బీజేపీ నాయకులని మండిపడ్డారు.
previous post