telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వామన్‌రావు దంపతులు హత్య పై కేటీఆర్‌…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాది వామన్‌రావు దంపతులు హత్య కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యల పై స్పందించిన టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌… వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. న్యాయవాదుల మీద మాకేం ఏం పగ ఉంటుంది..? మమ్మల్ని బూతులు తిట్టిన వారిని క్షమిస్తున్నాం. నడిరోడ్డుపైన ఇద్దరిని చంపినపుడు అంతా బాధపడ్డాం.. ఈ హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుంచి తక్షణమే తొలగించినట్టు తెలిపారు. అదేవిధంగా హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్‌ కఠినంగా ఉన్నారన్నారు. వామన్‌రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్లు దుయ్యబట్టారు. చూడాలి మరి ఈ కేసులో నిందితులను ఎప్పటివరకు అరెస్ట్ చేస్తారు అనేది.

Related posts