telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కాశ్మీర్ లో తెలంగాణ విదార్థులు … కేటీఆర్ చర్యలు..

ktr trs president

అమర్ నాథ్ యాత్రను ఉగ్రమూక లక్ష్యంగా పెట్టుకున్నారని రక్షణ శాఖ తెలుసుకోవడంతో ఉన్నపళంగా యాత్రికులను వెనక్కి పంపుతున్నారు. దీనితో కాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారనున్నాయనే ఉద్ద్యేశ్యంతో అటు అమర్ నాథ్ యాత్రికులతో పాటు, ఎన్ ఐటీ శ్రీనగర్ విద్యార్థులను కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశించిది. దాంతో, తాము శ్రీనగర్ లో చిక్కుకుపోయాయని, తమను కాపాడాలంటూ ఎన్ ఐటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం ఆ విద్యార్థులు సురక్షితంగా జమ్మూ చేరుకోవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 130 మంది తెలుగు విద్యార్థులు జమ్మూ చేరుకున్నారని, వారిని అక్కడి నుంచి రైలు ద్వారా సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ తీసుకువస్తామని ట్వీట్ చేశారు. ప్రభుత్వం టికెట్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. అంతకుముందు, తెలుగు విద్యార్థుల విషయం తెలియగానే, ఢిల్లీలో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఫోన్ నంబర్లు ట్విట్టర్ లో ఉంచారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి సాయం కావాలన్నా ఆ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

Related posts