telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్‌ జగన్‌తో కేటీఆర్‌ భేటీ

KTR Meets YS Jagan at Lotas pond

ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ అయ్యారు.  టీఆర్‌ఎస్‌ నేతలు వినోద్‌, సంతోష్‌‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్‌ లోటస్ పాండ్ లోని వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలు స్వాగతం పలికారు.

రాజకీయంగా కేటీఆర్ తొలిసారి ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చలు జరపనుండడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఫెడరల్‌ ఫ్రంట్‌, ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతుపై జగన్‌ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. తొలిసారి ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చలు జరపనుండడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Related posts