telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

జేఈఈ ర్యాంకర్లకు కేటీఆర్ అభినందనలు

ktr telangana

జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు శుక్రవారం వెల్లడైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 8.67 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 660 కేంద్రాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ర్యాంకులు సాధించడంపై  మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

జేఈఈ మెయిన్ రిజల్ట్స్ లో 100 పర్సంటైల్ స్కోరు సాధించింది దేశం మొత్తమ్మీద 24 మందే కాగా, వారిలో 8 మంది తెలంగాణ విద్యార్థులు ఉండడం విశేషం.ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

“జేఈఈ మెయిన్ ఎగ్జామ్ లో తమ అమోఘమైన ప్రదర్శనతో అందరినీ గర్వించేలా చేసిన తెలంగాణ యువ కిశోరాలకు నా శుభాభినందనలు. ఓవరాల్ గా 24 మందికి 100 పర్సంటైల్ స్కోరు వస్తే వారిలో 8 మంది తెలంగాణ వాళ్లే ఉన్నారు.  వాళ్లలో అమ్మాయిల విభాగం టాపర్ చుక్కా తనూజ కూడా ఉంది. అద్వితీయమైన సాధన” అంటూ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Related posts