ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సోమవారం వచ్చిన కలెక్షన్లతో మూడు వందల కోట్ల గ్రాస్ మార్కుని దాటేసింది “సాహో”. తాజాగా ఈ చిత్రబృందాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. కేటీఆర్కి తెలుగు సినీ సెలబ్రిటీలతో మంచి అనుబంధం ఉంది. తనకు వీలున్న ప్రతిసారి సినిమా వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేస్తుంటారు. అలాగే నచ్చిన సినిమాలను చూసి ట్విట్టర్ ద్వారా యూనిట్ని అభినందిస్తుంటారు. తాజాగా ఆయన రెండు తెలుగు సినిమాలు ‘సాహో’, ‘ఎవరు’ చిత్రాలను చూశారు. “సాహో టెక్నికల్గా అద్భుతమైన చిత్రం. ఇండియా మన సినిమా మార్కట్ పరిధిని పెంచింది. హీరో ప్రభాస్, డైరెక్టర్ సుజిత్లకు అభినందనలు. అలాగే `ఎవరు` సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే మూవీ. అడివిశేష్, రెజీనా, నవీన్చంద్రలు అద్భుతంగా నటించారు” అంటూ రెండు సినిమా యూనిట్లకు అభినందనలు తెలిపారు కె.టి.ఆర్.
previous post
“వెంకీమామ”లో రకుల్ పాత్రను కొట్టేసిన రాశిఖన్నా