చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. ఈ వైరస్తో చాలా మంది ప్రముఖులు కూడా మృతి చెందారు. తాజాగా ఈ వైరస్ బాలీవుడ్ను కూడా వణికిస్తోంది. ఇటీవలే వరణ్ ధావన్, నీతు కపూర్, డైరెక్టర్ రాజ్ మెహతా కూడా కరోనా బారీన పడ్డారు. తాజాగా.. ప్రముఖ కథానాయిక “వన్- నేనొక్కడినే” సినిమాతో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన కృతీ సనన్ కరోనా టెస్ట్ చేయించు కోవడంతో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. రాజ్ కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం చండీఘర్ వెళ్లిన కృతీ షెడ్యూల్ పూర్తి కావడంతో ఆదివారం ముంబైకి చేరింది. అయితే.. ఇక్కడకు రాగానే పరీక్ష చేయగా కొవిడ్ 19 అటాక్ చేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు. కృతీ సనన్కు ఎక్కడ, ఎలా కరోనా సోకిందో తెలియడం లేదని వారంటున్నారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
previous post
సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు ? : పరిణితి చోప్రా