ప్రముఖ నటుడు కృష్ణంరాజు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం కృష్ణంరాజు తమ ఇంటిలో కాలుజారి కిందపడిపోవడంతో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు కృష్ణంరాజును హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు.
ఈ రోజు ఉదయం అపోలో వైద్యులు ఆయన తుంటికి శస్త్రచికిత్స శస్త్రచికిత్స చేశారు.. తన ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని, కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే తాను ఆస్పత్రికి వచ్చానని ఆయన వివరించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితిపై చర్చించినట్లు తెలిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని, త్వరలో యూకే వెళ్లాల్సి రావడంతో రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి ఆస్పత్రికి వచ్చినట్లు వివరించారు.
ప్రస్తుతం కృష్ణంరాజు ‘రాధేశ్యామ్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.