telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కొవిడ్-19 ఎఫ్ఫెక్ట్ .. ఇటలీలో వృద్ధుడు మృతి

polution mask delhi

కొవిడ్-19 వైరస్ వల్ల తొలిసారిగా ఇటలీలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఇటలీ దేశంలోని పడువా నగరానికి చెందిన 78 ఏళ్ల మాజీ ఉద్యోగి కొవిడ్-19 వైరస్ సోకి మరణించారని వీనిటో గవర్నర్ లూకా జేయా చెప్పారు. రెండు వారాల క్రితం కొవిడ్ వైరస్ తో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించారు. మరో 14 మందికి కొవిడ్-19 వైరస్ సోకిందని వైద్యాధికారులు చెప్పారు.

దీంతో కొవిడ్ వైరస్ మొత్తం 17 మందికి సోకింది. కొవిడ్ వైరస్ ప్రభావంతో ఒకరు మరణించిన నేపథ్యంలో ఈ వైరస్ ఇటలీ దేశంలో ప్రబలకుండా అన్నిరకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.

Related posts