telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత‌ దంపతులకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

శుక్రవారం ఈ కేసుపై విచారించిన హైకోర్టు.. సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఓ సంస్థ పేరుతో రూ.50 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గీతను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఈ కేసులో సీబీఐ కోర్టు కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేయడంతో సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 16కు వాయిదా వేసింది.

Related posts