telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోటేశ్వరమ్మ మృతి విద్యారంగానికే తీరని లోటు

మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత్రి కోటేశ్వరమ్మ మృతి చెందారు. ఆమె మృతికి విద్యా సంస్థల యాజమాన్యాలతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కోటేశ్వరమ్మ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కోటేశ్వరమ్మ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రగాడ సంతాపం తెలిపారు. విద్యారంగానికి ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మాంటిస్సోరి విద్యాసంస్థల ద్వారా అనేక మందికి విద్యను అందించారని జగన్ కొనియాడారు. కోటేశ్వరమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కూడా సంతాపం తెలిపారు. కోటేశ్వరమ్మ మృతి విద్యారంగానికే తీరని లోటని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

 

Related posts