telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

‘కొండ’లు మళ్ళీ .. కదులుతున్నాయి.. ఈ సారి బీజేపీకే గుడి..

Konda Murali Comments for TRS

మరోసారి కొండా మురళి, కొండా సురేఖ దంపతులు పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. ఈసారి బీజేపీ వైపు చూస్తున్నట్టు వారి వర్గాల ద్వారా తెలుస్తుంది. కొండా దంపతులు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తమ కూతురుకి భూపాలపల్లి టికెట్ ఇవ్వాలనే షరతును వీరు బీజేపీ ఎదుట పెట్టినట్టు సమాచారం.

గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన సురేఖ, ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరోవైపు, గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. కొండా దంపతులు, గండ్ర ఇద్దరూ భూపాలపల్లి టికెట్ కోసం డిమాండ్ చేస్తుండటంతో కొంత సందిగ్ధత నెలకొందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

Related posts