telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం, మిషన్‌ భగీరథ మొత్తం దోపిడీ పథకాలే: కోమటిరెడ్డి

Komatireddy-Venkata-Redd

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్‌ భగీరథ మొత్తం దోపిడీ పథకాలేనని అన్నారు. శ్రీరామ్‌ సాగర్‌ చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చే వరకు పోరాటం చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. మూడు సంవత్సరాలుగా ఆగిపోయిన చత్తీస్‌ఘడ్‌-సిరోంచ రోడ్డు పనుల గురించి కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చి మూడు నెలల్లో సాధించానని పేర్కొన్నారు. నెల రోజుల్లో రోడ్డు పనులు ప్రాంరంభం కానున్నాయన్నారు.

కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దేశం కోసం పనిచేసిన వ్యక్తి అని, ఆయనను విమర్శించే అర్హత మంత్రి జగదీష్‌రెడ్డికి లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలలో ఓడిపోయినప్పటి నుంచి మంత్రి జగదీష్‌ మానసిక పరిస్థితి బాలేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్‌ఎస్‌ ఉద్యమ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. దీనికి ఈటెల రాజేందర్‌, రసమయి బాలకిషన్‌, నాయిని నర్సింహరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

Related posts