telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సాయి పల్లవి ‘కోలు కోలు’ పాట గ్లింప్స్…

దగ్గుపాటి రానా ప్రస్తుతం విరాటపర్వం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానాకు జంటగా సాయి పల్లవి చేస్తుంది. అయితే ఈ సినిమాలోని మొదటి పాటను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘కోలు కోలు’ అంటూ ఈ పాట సాగనుంది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. గ్లింప్స్ ను చూస్తుంటే ఈ పాట సాయి పల్లవి ప్రధానంగా తెరకెక్కిందని అర్థం అవుతోంది. అయితే 1990నాటి నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతోంది. ఈ సినిమాలో నక్సల్ నాయకుడు రవి అన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం నివేత పేతురాజ్‌నటిస్తుంది. ఈ సినిమా ”నీదీ నాదీ ఒకే కథ” ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందోలో నటి ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్ ఎల్ వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అభిమానులు అంచనాలు బాగానే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ప్రస్తుతం అభిమానులు ఈ పాట ఫుల్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts