telugu navyamedia
వార్తలు సామాజిక

కోల్ కతా లో మూడో కరోనా కేసు నమోదు!

karona virus case in canada found

భారత్ కు (కోవిడ్-19)కరోనా సోకే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కోల్ కతా లో మూడో కరోనా కేసు నమోదైంది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మరో వ్యక్తికి నావల్ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ చేశారు. ఈ మేరకు విమానాశ్రయా అధికారులు ఒక ప్రకటన చేస్తూ.. బ్యాంకాక్ నుంచి కోల్ కతా చేరుకున్న ప్రయాణికుడికి పరీక్షలు చేయగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిందని తెలిపారు.

ఈ తాజా కేసుతో కోల్ కతాలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వారంలో హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ అనే ఇద్దరు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలారని చెప్పారు. పాజిటివ్ గా తేలిన వారిని బలియాఘటా ఐడి అస్పత్రికి పంపినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు సర్వీసులు నడుపుతున్న పలు విమానాయన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి.

Related posts