భారత క్రికెట్ టీం కి సారధి విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు కు అతి చేరువలో ఉన్నాడు. కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న రన్మెషీన్ విరాట్ పరుగుల వరద పారించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20వేల పరుగుల మైలురాయిని అందుకోనున్న ఆటగాడిగా విరాట్ నిలవనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 19,896 పరుగులు ఉండగా.. మరో 104 చేస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో 20వేల రన్స్ సాధించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారాలను కోహ్లీ అధిగమించనున్నాడు.
సౌతాంప్టన్లో అఫ్గనిస్థాన్తో జరగనున్న మ్యాచ్లో కోహ్లీ 104 రన్స్ చేస్తే కేవలం 415 ఇన్నింగ్స్(131 టెస్టులు, 222 వన్డేలు, 62 టీ20)ల్లోనే ఈ ఘనత సాధించిన క్రికెటర్గా విరాట్ నిలవనున్నాడు. సచిన్, లారా ఇద్దరు కూడా 453 ఇన్నింగ్స్ల్లో మైలురాయి చేరుకోగా.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 468 ఇన్నింగ్స్ల్లో 20వేల పరుగుల మార్క్ను చేరుకున్నాడు. ప్రస్తుం 30ఏండ్ల విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవలే వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.