భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతున్నాడు. రెండు రోజుల్లో జరగబోయే విండీస్తో టెస్ట్ సిరీస్లో విరాట్ ఒక్క సెంచరీ చేస్తే చాలు.. కెప్టెన్గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(19) సాధించిన అత్యధిక సెంచరీల రికార్డును సమం చేస్తాడు.
వన్డేల్లోనూ పాంటింగ్(22) రికార్డును సరిచేయడానికి కోహ్లీ ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. అటు భారత్ ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే కెప్టెన్గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సాధించిన అత్యధిక విజయాలు(27)ను విరాట్ సమం చేస్తాడు.
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్..మసిబూసిన మారేడుకాయ: చంద్రబాబు