ఈ ప్రపంచకప్లో టీమిండియా ఓపెనర్ రోహిత్శర్మ అదరగొడుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటికే ఐదు సెంచరీలు బాది 647 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రోహిత్(103) ఐదో శతకం బాదడంతో పాటు టీమిండియా తరఫున కోహ్లీ తర్వాత హ్యాట్రిక్ సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విరాట్కోహ్లీ.. హిట్మ్యాన్ను ఇంటర్వ్యూ చేశాడు.
ఒక టోర్నీలో ఐదు శతకాలు చేయడం తానెప్పుడూ చూడలేదని, ఆఘనత సాధించిన నీకు ఎలా ఉందని కోహ్లీ ప్రశ్నించడం,. ‘ఈ ప్రపంచకప్ ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో జట్టు బాగా రాణించడం బాగుంది. ఒక బ్యాట్స్మన్గా, ఓపెనర్గా నా ఫామ్ని కొనసాగించాలనుకున్నా. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై శతకం బాదాక ఇలాగే మంచి ప్రదర్శన చెయ్యాలని భావించా. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నా’ అని రోహిత్ చెప్పుకురవడం సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.