telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

నేటి మ్యాచ్ తో .. మరో రికార్డు సాధించిన భారత సారథి కోహ్లీ..

kohli another record in 2nd t20 on westindies

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మరో రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20ల్లో 19 పరుగులు సాధించడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2563) చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పొడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇద్దరి మధ్య కేవలం ఒక్క పరుగు మాత్రమే వ్యత్యాసంగా ఉంది. ఇక తరువాతి మ్యాచ్‌లో సమీకరణాలు మారవచ్చు. ఇక ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లి, రోహిత్‌లు ఉండగా.. మార్టిన్‌ గప్టిల్‌(2463, న్యూజిలాండ్‌), షోయాబ్‌ మాలిక్‌(2263; పాకిస్తాన్‌) తరువాతి స్థానాల్లో ఉన్నారు.

Related posts