ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన మృతి పై అనుమానాలున్నాయని, సీబీఐ విచారణ కోరుతూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ బూరగడ్డని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ గతంలో కోడెల నివాసంలో బాంబులు పేలిన సందర్భంలో సీబీఐ విచారణ కోరినప్పుడు కూడా కోడెల భయపడలేదని గుర్తుచేశారు.
ఒక డాక్టరు అయిన కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని అన్నారు. కోడెల మృతికి సంబంధించి మిస్టరీ నడిచిందని అన్నారు. ఆయన ఆత్మహత్య వెనుక ఎవరు ఉన్నారో తేలాలని అన్నారు. కోడెల ఆత్మహత్య వెనుక చంద్రబాబు రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక కోడెల తనయుడు శివరామ్ కు సంబంధం ఉందని, సీబీఐతో విచారణ జరిగితేనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు.
సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ