మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు, తమ కుటుంబంపై అక్రమంగా కేసులు పెడుతున్నారని..’ సిట్ ‘ విచారణకు తాము సిద్ధమేనని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు మాట్లాడుతూ.. తమ కుటుంబం పై అక్రమంగా కేసులు పెడుతున్నారని, తమ పై కేసులు పెట్టాలంటూ.. వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
సిట్ విచారణకు తాము సిద్ధమేనని కోడెల స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలు మంచివి కావని అభిప్రాయపడ్డారు. తమపై కేసులు పెట్టడం కంటే.. అభివృద్ధి పనుల పై సిఎం జగన్ దృష్టి పెడితే మంచిదని కోడెల శివ ప్రసాదరావు సూచించారు.