ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో దిమ్మె ఏర్పాటు చేశారు. అయితే, విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని ఆదివారం రాత్రి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు విగ్రహ దిమ్మెను కూల్చివేశారు. ఈ క్రమంలో గ్రామంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలకేంద్రం వద్ద దిమ్మెను నిర్మించిన టీడీపీ నేతలు నేడు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఏర్పాట్లు చేశారు.