వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడలో రెచ్చిపోయారు. డబ్బుల పంపిణీ విషయంలో వైసీపీ కార్యకర్తలు, ఓటర్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న నాని వాగ్వివాదానికి దిగిన ఓటరుపై చేయి చేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా కలకలం రేగింది.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో టీడీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. దీనితో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
తాజ్ మహల్ ఒక సమాధి… ప్రపంచ వింతకాదు… రంగోలి రనౌత్ కామెంట్స్