telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం పనులను పరిశీలించనున్న ఆర్థిక సంఘం

Kaleshwaram project visit Finanacce Department

 కోటి ఎక‌రాల‌కు సాగునీరు అందించడమే ల‌క్ష్యంగా  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భారీ ప్రాజెక్టును పదిహేనవ ఆర్థిక సంఘం నేడు సందర్శించనున్నది. మధ్యాహ్నం 12.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు ఈ బృందం వెళ్లనున్నది. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.45 గంటల వరకు మేడిగడ్డ బరాజ్ పనులను బృందం సభ్యులు సందర్శిస్తారు.

భోజన అనంతరం 2.245 గంటలకు ప్యాకేజీ-6లో భాగంగా కొనసాగుతున్న నందిమేడారం టన్నెల్, పంపుహౌస్, సర్జ్‌పూల్ పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు సిరిసిల్లలో మిషన్ భగీరథ పనులను పరిశీలించి 5.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లుచేశారు. మేడిగడ్డ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుతో పాటు ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఫొటోలు, మ్యాపులతో ఛాయాచిత్ర ప్రదర్శనకు ఏర్పాటుచేశారు.

Related posts