telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఆ వార్తల్లో నిజం లేదు: కియా ఎండీ

kia-motors

కియా కార్ల పరిశ్రమను తమిళనాడు తరలిస్తారనే అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ప్రచురించిన కథనం ఏపీలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో కియా ఎండీ స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అనంతపురంలోనే తమ పరిశ్రమను కొనసాగిస్తామని తెలిపారు. అనంతపురం ఫ్యాక్టరీ నుంచే ప్రపంచ స్థాయి వాహనాలు తయారు చేస్తామని తెలిపారు.

గత కొద్ది రోజులుగా కియా కార్ల పరిశ్రమ అనంతపురం నుంచి తరలిస్తారనే ప్రచారం సాగింది. దీంతో విపక్షాలు, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంతకుముందు కియా పరిశ్రమ ఎక్కడికి వెళ్లదని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఏపీ నుంచి వెళ్తుందన్న దుష్ప్రచారంపై కియా కంపెనీ లీగల్‌ యాక్షన్‌ ఆప్షన్‌ను పరిశీలిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కంపెనీ కూడా పోదని తెలిపారు.

Related posts