మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కంట్రోల్ గదులు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ‘సేఫ్ సిటీ ప్రాజెక్టుకు’ శ్రీకారం చుడుతోందని ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ మెసేజ్ పోస్టు చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన మెట్రో నగరాల్లో ఉమెన్ పోలీసు పింక్ పెట్రోల్స్, ఆశాజ్యోతి కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహిళలకు ఉపయుక్తమయ్యే మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిర్భయ చట్టం నిధుల ద్వారా ఆయా కేంద్రాల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.