ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు తన అర్ధాంగి కావ్య ఇంట్లో తీరిక సమయాల్లో కరోనా మాస్కులు తయారుచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆమె మాస్కుల తయారీ చేపట్టిందని వివరించారు. తన భార్య తయారు చేస్తున్న మాస్కులను అవసరం ఉన్నవారికి అందిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి కుటుంబం ముందుకొచ్చి మాస్కుల తయారీలో పాలుపంచుకోవాలని సూచించారు. అంతేకాదు, తన భార్య కావ్య మాస్కులు తయారు చేస్తున్న ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా: లక్ష్మీనారాయణ