telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించింది: కిషన్ రెడ్డి

Kishan Reddy

తెలంగాణలో ఏడు ఎంపీ స్థానాల్లో ఓటమిపాలవడంతో టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బీజేపీపై విమర్శలు చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఎవరో తెలియదని చెప్పడం కేటీఆర్ కే చెల్లిందని అన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో కలసి నడ్డాను ఎన్నో సార్లు కలవలేదా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని కేటీఆర్ ప్రశ్నించారని, మీ చెల్లెలు కవితను అడిగితే బీజేపీ ఎక్కడుందో చెబుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ లా తాము అహంకారపూరిత వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని జోస్యం చెప్పారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని కిషన్ రెడ్డి అన్నారు. ఏపీ రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేదని తెలిపారు. 

Related posts