telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : ధావన్ సెంచరీ… పంజాబ్ లక్ష్యం..?

ఈ రోజు ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వరుస విజయాలతో ఉన్న ఢిల్లీని పంజాబ్ బౌలర్లు బాగానే కట్టడి చేసారు. వచ్చిన వారు అంత వరుసగా పెవిలియన్ కు చేరుకుంటున్న ఓపెనర్ శిఖర్ ధావన్ చివరివరకు ఘటిగా నిలబడ్డాడు. ఈ మ్యాచ్ లో 61 బంతుల్లో ఎదుర్కొన ధావన్ 106 పరుగులు చేసి ఐపీఎల్ లో వరుస సెంచరీలు నమోదుచేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. గబ్బర్ అద్భుతంగా ఆడటంతో ఢిల్లీ నిర్ణిత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయాయి. ఇంకా పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెలు తీయగా గ్లెన్ మాక్స్వెల్, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్ ఒక్కో వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలవానాతె 165 పరుగులు చేయాలి. అయితే మరోసారి పంజాబ్ ఓపెనర్లు రాణిస్తే విజయం సాధించవచ్చు. కానీ అదే సమయంలో చివర్లో తడబడకుండా చూసుకోవాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే వారు ప్లే ఆఫ్ రేస్ లో ఉంటారు. చూడాలి మరి ఎవరు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారు అనేది.

Related posts