telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆమె కిమ్ కంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి : వర్మ

varma

ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఏ సందర్భాన్నైనా తనదైన కోణంలో విశ్లేషిస్తూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడంలో రాంగోపాల్ వర్మకు సాటిలేరనే చెప్పాలి. ఇటీవల మందు డోర్ డెలివరీ చేయాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు సలహా ఇచ్చి కేటీఆర్ చేత పంచ్ వేయించుకున్నాడు వర్మ. తాజాగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి, అతని సోదరి గురించి ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. గత కొన్నిరోజులుగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మరణించాడనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆయన స్థానంలో అతని సోదరి అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు చూసిన వర్మ, తన క్రియేటివిటీకి పదును పెడుతూ ట్వీట్ చేశారు. ”కిమ్ జంగ్ ఉన్ మరణించారని, అతని స్థానంలో ఆయన సోదరి అధికార బాధ్యతలు చేపట్టనుందనే వార్తలు వింటున్నాను. ఆమె కిమ్ కంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి అని భావిస్తున్నా. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తంలో ఫస్ట్ లేడీ విలన్‌ ఆమెనే అవుతుంది. ఇంకా చెప్పాలంటే జేమ్స్‌బాండ్ సినిమా రియల్ అయినట్లే” అని పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ ట్వీట్‌ చూసి నెటిజన్స్ మాత్రం ఓ రేంజ్‌లో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts