ఏపిలో సంచలనం సృష్టించిన టీడీపీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన పాడువా పోలీసులు నిన్న రాత్రి నిందితుడు డొంబురును అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కొరాపుట్ జిల్లా పాడువా అటవీప్రాంతంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిని పోలీసులు ఎన్ఐఏ బృందానికి అప్పగించనున్నారు.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా సెస్టెంబర్ 23వతేదీన గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతుండగా నిషిద్ధ మావోయిస్టులు కాల్పులు జరపడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఈ సంఘటనను రాష్ట్రప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్లపై కేసులా ?: విజయశాంతి