పవన్కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్సాబ్’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉంది. దిల్రాజు-బోనీకపూర్ సంయుక్త నిర్మిస్తోన్న ఈమూవీలో ప్రకాశ్రాజ్ మరో లాయర్గా కనిపించనున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. ఈ సినిమా తర్వాత హరీష్-శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. అయితే.. ఈ సినిమా మొదలు కాకముందే కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కియారా అద్వానీ హీరోయిన్గా భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఇక బాలీవుడ్లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉంది ఈ భామ. మరి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెను అప్రోచ్ అవ్వగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న కియారా టాలీవుడ్ లో సినిమా చేస్తుందా అన్నది చూడాలి.
previous post
next post