telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీటూ ఉద్యమంపై కియరా అద్వానీ సంచలన వ్యాఖ్యలు

kira-adwani

సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది రంగుల ముఖాల వెనుక ఉన్న అసలు నిజాల్ని బయటకు తీసుకొచ్చిన ఉద్యమం మీటూ. అలాంటి మీటూపై తాజాగా కియరా అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2014లో ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది ఈ భామ. తాజాగా కియరా మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మీటూ వల్ల అనుకున్నంతగా పూర్తి ఫలితం రాలేదని చెప్పుకొచ్చిందీ ఈ ముద్దుగుమ్మ. మీటూ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని తాను అనుకున్నా కానీ.. అలాంటి మార్పు ఏం రాలేదంది కియరా. ఇక ముందు మార్పు వస్తుందని కూడా తాను అనుకోవడం లేదని చెప్పింది. అకస్మాత్తుగా కియార ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం కియరా బాలీవుడ్‌లోని ‘భూల్ బులయ్య 2’సినిమాలో నటిస్తుంది. ఇందులోకార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఆమె యాక్ట్ చేస్తుంది.

Related posts