తెలుగులో “భరత్ అనే నేను” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ భామ హిందీలో “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ తో తనలోని హాట్ నెస్ బయటపెట్టి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన “అర్జున్ రెడ్డి ” రీమేక్ “కబీర్సింగ్” చిత్రంతో కెరీర్లో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ. ప్రీతి పాత్రలో సహజనటనతో ఆకట్టుకున్నది. ఈ సక్సెస్తో బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. కియారా అద్వానీ ఇప్పుడు కోలీవుడ్లో తొలి అడుగు వేయబోతున్నది. విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ప్రస్తుతం కియారా “గుడ్న్యూస్”, “లక్ష్మీబాంబ్”, “షేర్షా”, “మర్జావా” సినిమాలు చేస్తోంది. అయితే కియారా తాజాగా ఆటోలో షూటింగ్కు వెళ్లడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొరియోగ్రాఫర్ షబినా ఖాన్తో కలిసి ముంబై వీధుల్లో ఆటోలో వెళుతున్న కియారా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్తో కలిసి చేస్తున్న “లక్ష్మీబాంబ్” షూటింగ్ స్పాట్కు కియారా ఆటోలో వెళ్లిందట. ఈ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు కియారా సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ ఇలా ఆటోలో వెళ్లడం అనేది నిజంగా విశేషమే మరి.
next post
అనసూయ గుండె బద్ధలైందట… ఎందుకంటే..?