telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తక్కువ జీతాన్ని ఇస్తున్నారని.. ఏపీలో కియా ఉద్యోగుల ఆందోళన

kia-motors

ఆంధ్రప్రదేశ్ లో కియా ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ అనుబంధ సంస్థ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీతం విషయంలో యాజమాన్యం తమను మోసం చేస్తోందని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇస్తామన్న జీతాన్ని, విధుల్లో చేరిన తర్వాత ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని అడిగితే కాంపీనీలో మీ అవసరం లేదంటూ బయటకు పంపేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts