telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“కియా” పై హాన్స్ ఇండయాలో కథనం

kia-motors

కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. రాష్ట్రంలోని గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు దీనిపై వాడివేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో హాన్స్ ఇండియా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ప్లాంటు తరలింపుపై కియా మోటార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ తమతో మాట్లాడారని ఆ పత్రిక తెలిపింది.

హాన్స్ ఇండియా కథనం ప్రకారం మనోహర్ భట్ తెలిపిన వివరాలు: ‘ఈ కథనాన్ని చూసి మేము షాక్ కు గురయ్యాం. ఏపీలో అద్భుతంగా పని చేస్తున్న తమ ప్లాంట్ గురించి ఇలాంటి కథనం రావడంతో షాకయ్యాం. చాలా దారుణంగా ఊహించి రాశారు. ఆ కథనంలో ఎలాంటి నిజం లేదు. ఏపీ ప్రభుత్వంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ‘పేరు వెల్లడించని కియా మోటార్స్ అధికారి’ అంటూ కథనంలో పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీని వెనుక ఎవరున్నారో మాకు తెలియదు’ అని మనోహర్ భట్ చెప్పినట్టు హాన్స్ ఇండియా తెలిపింది.

Related posts