మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కడప జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఖలీల్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీ లో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ సాయంత్రం లోటస్పాండ్లో ఆ పార్టీ అధినేత జగన్తో బాషా భేటి కానున్నారు. కడపలో 7 వ తేదీన జరుగుతున్న శంఖారావం సభలో ఆయన అధికారంగా వైఎస్ఆర్సీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. తనకు టీడీపీలో తగినంత గుర్తింపు ఇవ్వడం లేదనే గత కొంత కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.