కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో మంచి విజయం సాధించింది. దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అన్ని ఇండస్ట్రీలని షాక్కి గురి చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్రలలో రమ్యకృష్ణ, సంజయ్ దత్, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే..తాజాగా ఈ మూవీ నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కేజీఎఫ్2 నుంచి సర్ ఫ్రైజ్ రాబోతుందట. జనవరి 8న చిత్ర టీజర్ విడుదల చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. అదే రోజు యశ్ పుట్టిన రోజు. అందుకే బర్త్ డే గిఫ్ట్గా ఫ్యాన్స్కు ఫీస్ట్ అందించనున్నారని టాక్. అయితే… ఈ వార్త ఏ మేరకు నిజమో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా షూటింగ్స్ చేయడం చాలా కష్టం : సి. కళ్యాణ్