telugu navyamedia
క్రీడలు వార్తలు

రాజస్థాన్‌ కెప్టెన్ పై పీటర్సన్‌ ప్రశంసలు…

ఐపీఎల్ 2021లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్ చేసిన సెంచరీ తనను ఎంతో ఆకట్టుకుందని పీటర్సన్‌ చెప్పాడు. స్టీవ్ స్మిత్‌ను రాయల్స్‌ ఈసారి వేలంలోకి వదిలేయడంతో శాంసన్ ఆ జట్టు పగ్గాలు అందుకున్నాడు. తాజాగా కెవిన్‌ పీటర్సన్‌ మాట్లాడుతూ… ‘ప్రతీ ఏడాది సంజు శాంసన్‌ ఆటను ఆస్వాదిస్తా. అతడు షాట్లను నేను బాగా ఇష్టపడతా. గతేడాది ఐపీఎల్‌లో నేను కామెంటరీ ఎక్కువగా చెప్పాను. ఎక్కువగా అతని నిలకడ గురించి మాట్లాడా. ఐపీఎల్ 2020లో శాంసన్‌ మధ్యలో ఫామ్‌ను కోల్పోయాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగులే చేసి ఔట​య్యాడు. అది అతనికి రెండో మ్యాచే. ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నందున విమర్శలు అనవసరం. ప్రస్తుతం అతని బాధ్యతలు వేరే స్థాయిలో ఉన్నాయి. అతడు రాయల్స్‌ కెప్టెన్‌. స్టోక్స్‌ లేని లోటును పూడ్చుకోవాల్సిన అవసరం శాంసన్‌పై ఉంది’ అని అన్నాడు. సంజు శాంసన్ అంతర్జాతీయ కెరీర్‌ గురించి కెవిన్ పీటర్సన్‌ మాట్లాడుతూ… ‘భారత్‌ తరఫున ఏ పరిస్థితుల్లోనైనా తన పవర్‌ ప్లే క్రికెట్‌తో ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. పరుగులు చేసిన తర్వాత.. ఇంకా పరుగులు చేస్తాడు అని తెలిపాడు.

Related posts