telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వంశీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు: కేశినేని నాని

kesineni-nani

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌‌ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  వంశీ వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోఆయనను  బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. నిన్న రాత్రి దాదాపు మూడున్నర గంటలపాటు కేశినేని నివాసంలో వల్లభనేనితో చర్చించారు. ఈ విషయంపై కేశినేని మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా రాటుదేలడానికి పోరాడాల్సి ఉంటుందన్నారు.

రాజకీయాల్లో ఒత్తిళ్లు ఎదుర్కోవడం సహజమని వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ పోరాడి, గెలిచిన వ్యక్తి ఇప్పుడు వెన్ను చూపడం సరికాదని అన్నారు. ఆయనకు తాము చెప్పాల్సింది చెప్పామని తెలిపారు. వంశీ ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కేశినేని నాని తెలిపారు. ఆయనే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

Related posts