telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మెజార్టీ ప్రజలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు: కేశినేని

kesineni nani tdp

రాష్ట్రానికి మూడు రాజధానుల బిల్లును నిన్న ఏపీ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేయడంతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వాకౌట్ చేసిన వేళ, సభలో కేవలం వైసీపీ సభ్యులు మాత్రమే ఉన్న సమయంలో ఈ బిల్లు సభ ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.

సీఎం జగన్, ఆయన గ్యాంగ్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని ఇండియా టీవీ నిర్వహించి సర్వే స్పష్టం చేసిందని చెప్పారు. 67 శాతం మంది జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. దీంతో పాటు ఇండియా టీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వివరాలను షేర్ చేశారు. మెజార్టీ ప్రజలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారని పేర్కొన్నారు. 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను అరెస్ట్ చేయడాన్ని కేశినేని ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షలో భాగంగా చేశారని మండిపడ్డారు. జయదేవ్ ను వెంటనే విడుదల చేయాలని కేశినేని డిమాండ్ చేశారు.

Related posts